Sonia gandhi | కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తునట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు పోటీ చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తుంది. రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈసారి సోనియా గాంధీ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా వుండనున్నట్టు తెలుస్తుంది.
తొలిసారిగా రాజ్యసభకు పోటీ చేస్తున్న Sonia gandhi
రాయ్బరేలీ నుండి ఐదుసార్లు MPగా ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ తొలిసారిగా రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక 1999లో తొలిసారి సోనియా గాంధీ MPగా గెలుపొందారు. రాజస్థాన్లో ఎన్నికలు జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయసంగా గెలిచే అవకాశాలున్నాయి. అందువల్ల సోనియా గాంధీని రాజస్థాన్ నుండి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.
Also Read | BJP రైతుల గొంతుకను అణచివేస్తోంది : మల్లికార్జున్ ఖర్గే