Sevalal Jayanti | గిరిజనుల ఆరాధ్యదైవం, గొప్ప సంఘ సంస్కర్త సంత్ సేవాలాల్ మహరాజ్ (Sant sevalal maharaj) జయంతి వేడుకలు గురువారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఘనంగా నిర్వహించారు.
Sevalal Jayanti | గొప్ప సంఘసంస్కర్త, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకలు గురువారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ మత్తు పదార్థాలు, హింసకు ప్రజలు దూరంగా ఉండాలని సేవాలాల్ మహరాజ్ పిలుపునిచ్చారని తెలిపారు.
సేవాలాల్ దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త అన్న KTR
సేవాలాల్ మహారాజ్ యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్తగా అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు చూపించిన బాటలో పయనించి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, MP మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, BRS నేతలు పాల్గొనడం జరిగింది.
Also Read | కాళేశ్వరంపై అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడి..!