Priyanka Gandhi | కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణలోని చేవెళ్ల పర్యటన రద్దయింది. ప్రియాంక ఈ నెల 27న చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ప్రియాంక పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యింది. ఈ నెల 27న చేవెళ్ల నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పర్యటనలో భాగంగా, ప్రియాంక సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెండు పథకాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కానీ ప్రియాంక పర్యటన రద్దు కావడంతో వర్చువల్ విధానంలో ఈ రెండు పథకాలను ప్రారభించనున్నట్టు తెలుస్తుంది.
రూ. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్ను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకొంది. కానీ అనివార్య కారణాల వల్ల ప్రియాంక పర్యటన రద్దయ్యింది.
Also Read | రేపటి నుంచి రాష్ట్రంలో రూ.500 గ్యాస్ సిలిండర్లు..!