BRS MP candidates | తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. శనివారం 9 మంది అభ్యర్థులతో BJP తన తొలి జాబితా విడుదల చేయగా, నేడు ప్రధాన ప్రతిపక్షమైన BRS నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తారని కేసీఆర్ చెప్పారు.
MP అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన BRS అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించాలని యోచిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలతో, రాబోయే ఎన్నికలను నావిగేట్ చేయడానికి BRS పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.
Also Raed: బీజేపీ తొలి జాబితాలో అన్ని వర్గాలకూ చోటు.!