Gaza | ఇజ్రాయెల్తో యుద్ధం పాలస్తీనాలోని గాజాలో పరిస్థితిని దయనీయంగా మార్చింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలను ఆదుకునేందుకు చాలా దేశాలు మానవతా దృక్పథంతో ముందుకు వస్తున్నాయి. విమానాల(Air Drop) ద్వారా గాజాలోకి ఆహారాన్ని తరలిస్తున్నారు. సాయం అందించే క్రమంలో తాజాగా గాజాలో విషాదం చోటు చేసుకుంది.
శుక్రవారం ఉత్తర గాజాలోని శరణార్థుల శిబిరంలోకి పారాచూట్తో ఫుడ్ ప్యాక్ను తరలించారు. అందులో ఒక బాక్స్ పారాచూట్ తెరుచుకోలేదు. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలపై అది పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ఎమర్జెన్సీ హెడ్ నర్స్ మహ్మద్ అల్-షేక్ క్షతగాత్రులను అల్-షిఫా హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
Also Read: గాజా మరణాల సంఖ్య 30,228కి చేరుకుంది: మంత్రిత్వ శాఖ