Yadadri Brahmotsavam 2024 | శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. దీనికనుగుణంగా ఆలయ అధికారులు 10 వేల మంది భక్తులు కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రధానాంశాలు
Yadagirigutta : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నరసింహులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం (నేటి నుండి) ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
శృంగార డోలోత్సవంతో ముగియనున్న Yadadri Brahmotsavam 2024
ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి. ఉత్తర మాఢ వీధుల్లో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజులు స్వామివారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ అధికారులు 10 వేల మంది భక్తులు కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు CM రేవంత్రెడ్డితో పాటు మంత్రులందరూ హాజరుకానున్నారు. స్వామివారికి రేవంత్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు CM, మంత్రులు హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైనున్న ఆలయంపై ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేస్తామని ఈవీ రామకృష్ణారావు తెలిపారు. కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.
11 రోజుల వేడుకలు
మార్చి 11 | విశ్వకేశన ఆరాధన, స్వస్తివచనం, అంకురారోపణం, రక్షా బంధనం | అంకురార్పణం |
మార్చి 12 | ద్వజారోహణం | భేరీపూజ, దేవతాహవనం, హవనం (సాయంత్రం 6గం) |
మార్చి 13 | మత్స్య అవతార అలంకర్ణ | శేష వాహన సేవ |
మార్చి 14 | వటపత్రసాయి అలంకారం | హంస వాహన సేవ |
మార్చి 15 | శ్రీ కృష్ణ అలంకారం | పొన్న వాహన సేవ |
మార్చి 16 | గోవర్ధనగిరి అలంకారం | సింహ వాహన సేవ |
మార్చి 17 | జగన్మోహినీ అలంకారం | అశ్వ వాహన సేవ, ఎదురుకోలు ఉస్తవం |
మార్చి 18 | శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, తిరుకల్యాణ మహోత్సవం | గజ వాహన సేవ |
మార్చి 19 | గరుడ వాహన సేవ | దివ్య విమాన రథోత్సవం |
మార్చి 20 | మహాపూర్ణాహుతి, చక్రతీర్థం | శ్రీపుష్పయాగం |
మార్చి 21 | ఘటాభిషేకం | శృంగార డోలోత్సవం , ఉస్తవం సమాప్తి. |
ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ మాసాల్లో అంటే శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు (11) రోజులు (సాధారణంగా ఫిబ్రవరి & మార్చి నెలల్లో) నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉత్సవాలు మార్చి 11న ప్రారంభమై మార్చి 21న ముగుస్తాయి.
Also Read: అస్సాంలో రూ.17,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని..!