Kurnool | కన్నకూతురును గొంతుకోసి చంపేశాడో కసాయి తండ్రి. కర్నూలు జిల్లా కోసిగి మండలం జంపాపురం (Jampapuram)లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు.
Kurnool | మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన నిందితుడు
మద్యానికి బానిసైన శాంతి కుమార్ కొంతకాలంగా సైకోగా ప్రవర్తిస్తూ, ప్రతి రోజు మద్యం తాగొచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే మద్యం తాగొచ్చి ఈరోజు ఉదయం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. శాంతి కుమార్ భార్య నిద్రలేచి చూసేసరికి కూతురు రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read | బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో తొలి అరెస్ట్ చేసిన NIA..!