young man died | తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు SRSP కాలువలో శవమై తేలాడు. భూక్యా కృష్ణతేజ అనే యువకుడు హైదరాబాద్ లో IT ఉద్యోగం చేస్తున్నాడు. 29 ఏళ్ల కృష్ణతేజ స్వస్థలం హనుమకొండ జిల్లా గోకుల్ నగర్. నర్సంపేటకు చెందిన ఓ యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఈ నెల 16న వివాహం పెట్టుకున్నారు. పెళ్లికార్డులు ఇవ్వడానికి కృష్ణతేజ ఈ నెల 10న ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు మళ్లీ ఇంటికి రాలేదు. దాంతో అతడి కుటుంబ సభ్యులు, గాలింపు చేపట్టారు
young man died | అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా, పలివేల్పుల సమీపంలో SRSP కాలువ వద్ద కృష్ణతేజ బైక్ కనిపించింది. దాంతో అతడి కుటుంబ సభ్యులు కాకతీయ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్ధన్నపేట మండలి కుమ్మరిగూడెం వద్ద SRSP కాలువలో ఓ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా, అది కృష్ణతేజ మృతదేహం అని గుర్తించారు. పోలీసులు కృష్ణతేజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Also Read | రోడ్డు ప్రమాదంలో AR హెడ్ కానిస్టేబుల్ మృతి