Anand Mahindra | ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపుల చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్కు థార్ కారును బహుమతిగా అందించారు.
2013లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్, ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన ఐదుటెస్టుల సిరీస్లో భాగంగా మూడోటెస్ట్ మ్యాచ్లో తొలిసారిగా భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఆడిన తొలి ఇన్నింగ్స్లోనే 62 పరుగులు చేసి రాణించాడు. తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సర్ఫరాజ్పై ప్రశంసలు కురిపించారు. ఆనంద్ మహీంద్రా సైతం సర్ఫరాజ్ ఆటతీరుకు ఫిదా అయ్యారు.
Anand Mahindra | అరంగేట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్
ఈ మేరకు సర్ఫరాజ్ తండ్రికి థార్ కారును బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. X (ట్విట్టర్) పోస్టులో సర్ఫరాజ్ను మహీంద్రా ప్రశంసిస్తూనే తన సందేశాన్ని చెప్పారు. ‘ధైర్యం కోల్పోవద్దు. శ్రమ, ధైర్యం, సహనం, పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఇంతకంటే మంచి గుణం ఏముంటుంది. స్పూర్తిదాయకమైన తండ్రిగా నౌషాద్ ఖాన్ ‘థార్’ కానుకగా స్వీకరిస్తే అదే నాకు ఆనందం… దక్కిన గౌరవం’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తాజాగా తాను ఇచ్చిన ప్రామిస్ను మహీంద్రా నిలబెట్టుకున్నారు.
Also Read | IPL 2024లో 6 వికెట్ల తేడాతో బోణి కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్..!