karimnagar | కరీంనగర్లో శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కరీంనగర్ లోని ఉజ్వల పార్కు సమీపంలో, బైపాస్ రోడ్డులో గల IT టవర్ వద్ద KTM బైక్ పై వేగంగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులు బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరొక వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read | RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లాలో RTC బస్సు బోల్తా పడి ఐదుగురికి గాయాలు