అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా (special status for AP) విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ YS షర్మిల విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లు నాటకం ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన YSR కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎంపీలు ఒక్కరోజు కూడా ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో మాట్లాడలేదని షర్మిల మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా (special status for AP) కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం తన హయాంలో ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని షర్మిల విమర్శించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ రాజీ పడుతున్నారని షర్మిల ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చించేందుకు ఆమె రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అన్ని సన్నాహకాలు పూర్తి అయినందున రేపటి రోజున అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వ్యక్తుల నుంచి 1500 దరఖాస్తులు వచ్చాయని షర్మిల వెల్లడించారు. జాబితాను ఖరారు చేసే ముందు అభ్యర్థుల పనితీరుపై సర్వే నిర్వహించనున్నారని తెలిపారు.
Also Read: APలో కాంగ్రెస్ పార్టీ 9 హామీలను ప్రకటించిన వైఎస్ షర్మిల..!