హైదరాబాద్: ఏప్రిల్ 5న జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) Vs చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్ కోసం అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో నకిలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టిక్కెట్లు (Fake IPL tickets) విక్రయిస్తున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (DCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సోమవారం వార్నింగ్ ఇచ్చారు. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మోసపూరిత టికెట్ (Fake IPL tickets) ఆఫర్ల వలలో పడవద్దని జగన్ మోహన్ రావు ప్రజలను కోరారు. “టిక్కెట్లు విక్రయిస్తున్న అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే, దయచేసి వెంటనే మాకు తెలియజేయండి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయండి. మన క్రికెట్ను సురక్షితంగా మరియు భద్రంగా ఉంచుకుందాం!” అని ఆయన ట్విట్టర్ లో తెలిపారు.