హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం నల్గొండ జిల్లా దాసరి నెమిలిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన చెరువుల పండుగ సందర్భంగా వడిత్య పాండు మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.
దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ విజ్ఞప్తి మేరకు మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసి వారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.