కరీంనగర్: భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది కానీ ఎవరికి ఏమి జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
మోటార్బైక్ను ఢీకొట్టకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఎమ్మెల్సీ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న 2కె రన్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ హుజూరాబాద్కు వెళ్లే క్రమంలో జరిగిందని పోలీసులు తెలిపారు.
తాడికల్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్పై అదుపు తప్పి ప్రమాదానికి దారితీసింది. కారులోని ఎయిర్బ్యాగ్ల వల్ల ఎమ్మెల్సీతో పాటు ఇతరులు కూడా సురక్షితంగా బయటపడ్డారు.
అక్కడి నుండి కౌశిక్ రెడ్డి మరో వాహనంలో హుజూరాబాద్కు వెళ్లగా, బైకర్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.