హైదరాబాద్: ఆదివారం అమావాస్య కాగా సోమవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అయింది ఈ ఆషాఢ మాసం మొత్తం అమ్మవార్లకు పూజలు జరుగుతాయి.
ఆషాఢ మాసం బోనాల జాతర ప్రారంభం కానున్నాయి నేడు లంగర్ హౌస్ లో తొట్టెల ఊరేగింపు జరుగుతుంది. ఇందులో భాగంగా బల్కం పేట ఎల్లమ్మ తల్లికి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి.