Home   »  వార్తలుతెలంగాణ   »   ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు దగ్ధం అవుతున్నాయి..

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. మూడు బోగీలు దగ్ధం అవుతున్నాయి..

schedule raju

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లో పెద్దఎత్తున  మంటలు వ్యాపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి బొమ్మాయి పల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైలు మూడు బోగీలు మంటల్లో దగ్ధం అవుతున్నాయి. ఫలక్‌నుమా రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రైలును ఆపివేసిన అధికారులు ప్రయాణికులను బోగీల నుంచి దింపేశారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు మంటలు చెలరేగడం గమనించి వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పిందని చెబుతున్నారు. ఒక్కసారిగా ఊహించని సంఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.