Home   »  తెలంగాణవార్తలు   »   24 గంటల్లో ఇద్దరు గుండెపోటు తో మృతి

24 గంటల్లో ఇద్దరు గుండెపోటు తో మృతి

schedule sirisha

ఖమ్మం: ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. ఆరోగ్యంగా కనిపించే వారు కూడా గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణిస్తున్నారు. ముఖ్యంగా టీనేజర్లు, యువకులు గుండెపోటుకు గురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఖమ్మంలో 24 గంటల్లో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. 31 ఏళ్ల శ్రీధర్ ఈ రోజు జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతను మరణించాడు.

శ్రీధర్ తండ్రి మానుకొండ రాధాకిషోర్ గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, ఖమ్మంలోని అల్లిపురంలో గరికపాటి నాగరాజు(33) కూడా గుండెపోటుతో మృతి చెందారు.

నాగరాజు తన కుటుంబీకులతో మాట్లాడుతూ ఉండగానే అనుకోకుండా అతనికి నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే తనని స్థానికి ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు చెప్పారు.