Home   »  వార్తలుజాతీయం   »   తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపిన కర్ణాటక పోలీసులు…

తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపిన కర్ణాటక పోలీసులు…

schedule yuvaraju

బెంగళూరు: కర్ణాటక పోలీసులు మంగళవారం బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగను కాల్చిచంపారు. దొంగను యాసిర్‌(26)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుల్తాన్‌పాళ్యం సమీపంలోని భువనేశ్వరినగర్‌లో నివాసముంటున్న యాసిర్‌పై 7 దోపిడీ, మగ్గింగ్ కేసులు ఉన్నాయి. నిందితుడిని సదాశివనగర్ ప్యాలెస్ సమీపంలోని ఏకాంత ప్రదేశంలో కాల్చారు.

ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. తప్పించుకునే క్రమంలో పోలీసులపై దాడికి యత్నించిన దొంగను పోలీస్ ఇన్‌స్పెక్టర్ శేషాద్రిపురం సమీపంలో కాల్చిచంపారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియరాలేదు. తదుపరి విచారణ కొనసాగుతోందని కర్ణాటక రాష్ట్ర పోలీసులు తెలిపారు.