లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడిన ఓ 42 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ హెల్ప్ లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి మోదీ, యోగి ని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ బెదిరింపు కాల్పై విచారణ చేపట్టారు. ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గోరఖ్పూర్ వాసిగా గుర్తించి అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, బెదిరింపులకు పాల్పడిన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు తేలిందన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.