Home   »  వార్తలు   »   భర్తను చెంబుతో కొట్టి హతమార్చిన భార్య

భర్తను చెంబుతో కొట్టి హతమార్చిన భార్య

schedule sirisha

అంబేద్కర్ కోనసీమ: తాగి వచ్చి రోజు తనని కొడుతున్నాడని ఓ భార్య భర్తను చెంబుతో కొట్టి కడతేర్చిన ఘటన లంకలో వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం లంక గ్రామం లో నివసించే ఇసుకపట్ల రామకృష్ణ(34) ప్రతిరోజు తాగివచ్చి భార్యని తన తల్లిదండ్రులను బాగా కొట్టి నానా రకాలుగా హింసించేవాడు అని చెప్పారు.

రోజు తాగి కొడుతున్న నేపథ్యంలో భార్య సత్యనారాయణమ్మ ఎదురుతిరిగింది తన చేతికి దొరికిన చెంబుతో అతని తలపై బలంగా కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. వెంటనే ఆమె వెళ్లి పోలీసులకు లొంగిపోయింది అని తెలిపారు.