Home   »  వార్తలుఆంధ్రప్రదేశ్ఉద్యోగం   »   PHD పొందిన రోజు వారి కూలి.!

PHD పొందిన రోజు వారి కూలి.!

schedule raju

హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన సాకే భారతి (35) అనే మహిళ రసాయన శాస్త్రం (కెమిస్ట్రీ)లో PHD పట్టాతీసుకుంది. ఆర్ధిక సమస్యల వల్ల పదో తరగతిలోనే పెళ్లిచేసుకొని, ఒకరోజు కూలి పనికి, మరో రోజు కాలేజీకివెళ్తూ చదువు కొనసాగించింది. ఫలితంగా జూలై 17న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ నుంచి PHD పట్టా అందుకున్నారు.

భారతి ప్రొఫెసర్ డాక్టర్ M.C.S. శుభతో కలిసి ‘బైనరీ మిక్స్‌చర్స్‌’పై పరిశోధన చేసే అవకాశం వచ్చింది. అందుకు అందిన స్టైఫండ్ భారతికి కొంతమేరకు ఉపయోగపడింది. భారతి ఇప్పుడు పీహెచ్‌డీ చేసిన కాలేజీలోనే ప్రొఫెసర్‌గా ఉద్యోగం వస్తుందని ఆశతో ఉంది.