Home   »  రాజకీయంతెలంగాణవార్తలు   »   ఢిల్లీలో అమిత్ షా తో బండి సంజయ్ భేటీ

ఢిల్లీలో అమిత్ షా తో బండి సంజయ్ భేటీ

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ BJP మాజీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఈ రోజు ఉదయం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు.

తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కరీంనగర్ ఎంపీతో చర్చించినట్లు షా తెలిపారు. తెలంగాణలో అధికార BRSను ఢీకొనేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో ఎన్నికల కోసం సమావేశాలు జరగనున్నాయి.

“భారత రాజకీయాల చాణక్యుడు అమిత్ షా జీ, గౌరవనీయులైన హోం మంత్రిని కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంది. మీ సమర్ధవంతమైన మార్గదర్శకత్వం, దిశానిర్దేశంతో, తెలంగాణలో BJP ని బలోపేతం చేయడానికి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాను”అని సంజయ్ కుమార్ ట్వీట్ చేశారు.