Home   »  తెలంగాణవార్తలు   »   కృష్ణా నది ఒడ్డున మొసళ్లు…

కృష్ణా నది ఒడ్డున మొసళ్లు…

schedule sirisha

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో నారాయణపేట జిల్లా సమీపంలో కృష్ణా నది ఒడ్డున మొసళ్లు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రవహిస్తున్న నది ప్రవాహంలోకి ప్రవేశించడాన్ని చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

అయితే జిల్లాలో ప్రతి వర్షాకాలంలో నీటి ప్రవాహం ఎక్కువైన ప్రతిసారి కృష్ణా నదిలో మొసళ్లు కొట్టుకుపోవడం సర్వసాధారణమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో వరదల బీభత్సం నుండి ప్రజలను రక్షించడానికి పోలీసులు, సహాయక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.