ములుగు జిల్లా పస్రాలో దయ్యాలవాగు ప్రస్తుత పరిస్థితిని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి, అనంతరం పస్రా నుండి వైపు వెళ్లే రహదారి లో ఉన్న గుండ్ల వాగు పరిస్థితిని పరిశీలించి, స్థానికులను కలసి వారికీ ధైర్యం చెప్పిన ఎస్టీ సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
జాతీయ రహదారి పునరుద్ధరణకు సంబంధించిన పూర్తి నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని, అదే విధంగా రహదారి పై రాక పోకలు జరిగే విధంగా వెంటనే రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన సత్యవతి.
వరద ప్రభావిత కొండాయి గ్రామ సహాయక చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షీంచారు. ములుగు జిల్లా కొండాయిలోని ప్రభుత్వ పాఠశాల భవనం పై చిక్కుకున్న 60 మందిని హెలికాప్టర్ ద్వారా పునరావాస కేంద్రాలకు తరలించారు.