ఆంద్రప్రదేశ్: YSR వాహనమిత్ర పథకంలో భాగంగా ఈనెల 31న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్త దరఖాస్తుకు ఈ రోజుతో గడువు ముగియగా,ఎల్లుండి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈసారి కొత్తగా రేషన్ సరఫరా చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(MDU) ఆపరేటర్లకు కూడా నగదును చెల్లించనుంది. గతేడాది 2.61 లక్షల మందికి లబ్ది చేకూరగా, ఈసారి సంఖ్య భారీగా పెరగనుంది.
ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఇన్సూరెన్స్, రిపేర్లు, సర్వీసింగు.. ఇలా చాలా ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చుల నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేలా ఏటా రూ.10 వేలు ప్రభుత్వం సాయం అందిస్తోంది.