నంద్యాల: గత కొద్ది రోజులుగా APలోని పుణ్యక్షేత్రాల్లో వన్య మృగాల సంచారం అధికమైపోయింది. శుక్రవారం(నిన్న) తిరుమలలో మరో చిరుత హల్ చల్ చేయగా తాజాగా నంద్యాల జిల్లా మహానంది క్షేత్ర పరిసరాల్లో ఎలుగు బంటి ఈ రోజు తెల్లవారుజామున హల్ చల్ చేసింది. తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో కరివేన సత్రం వద్ద ఎలుగుబంటి కనిపించిందని భక్తులు తెలిపారు.
వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎలుగుబంటి నంద్యాల లో ఎటు నుండి ఎటు వెళ్ళిందని నిర్ధారించనున్నారు. దాన్ని బట్టి వారు చర్య తీసుకుంటాము అని అధికారులు వెల్లడించారు.