ఆంధ్రప్రదేశ్: ఏపీ లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీలో ఉద్యోగం రాకపోవడంతో, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ నెల 17న తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి దొంగతనం చేశాడు. ఇంట్లోని రూ.80 వేల నగదు, తులం బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయాడు. దొంగతనం చేసిన బంగారం గుంటూరుకు తీసుకెళ్లి అక్కడ ఓ బ్యాంకులో వాటిని కుదవ పెట్టి డబ్బు తీసుకున్నాడు. ఆ డబ్బును పూర్తిగా ఖర్చు చేశాడు. అనంతరం తిరిగి రామకృష్ణకాలనీకి వస్తుండగా సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు నిఘా ఉంచి అతడిని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగం రాకపోవడంతో దొంగగా మారిన యువకుడు.
Related News
Also Read