మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) Y.S.R.C.P కి గుడ్ బై చెప్పారు. అధికార పార్టీని వీడుతున్నట్లు అంబటి రాయుడు ట్విట్టర్(X) ద్వారా వెల్లడించారు.
ఇటీవల డిసెంబర్ 28 2023న A.P ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో అంబటి రాయుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ కండువా కప్పుకున్న వారంలో రోజుల్లో అంబటి రాయుడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అంబటి రాయుడు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి త్వరలో ప్రకటన చేస్తానంటూ తన ట్విట్టర్( X) వేదికగా వెల్లడించారు.
రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన Ambati Rayudu
కొంతకాలంగా జగన్ పాలనపై అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. అంబటి రాయుడు డిసెంబర్ 28న తాడేపల్లి నివాసంలో A.P సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు అంబటి రాయుడు తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు.
ALSO READ: కేసీఆర్ తో భేటీ కానున్న A.P సీఎం వైఎస్ జగన్