Home   »  ఆంధ్రప్రదేశ్క్రీడలు   »   ఆంధ్ర ప్రీమియర్ లీగ్… నేడే ప్రారంభం.!

ఆంధ్ర ప్రీమియర్ లీగ్… నేడే ప్రారంభం.!

schedule raju

నేటి నుంచి విశాఖ వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఆరు జట్లు కోస్టల్‌ రైడర్స్‌, బెజవాడ టైగర్స్‌, వైజాగ్‌ వారియర్స్‌, రాయలసీమ కింగ్స్‌, మార్లిన్‌ గోదావరి టైటాన్స్‌, కేవీఆర్‌ ఉత్తరాంధ్ర లయన్స్‌ బరిలోకి దిగుతుండగా.. ఫైనల్‌తో సహా 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 27న ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన భరత్‌, హనుమ విహారితో పాటు ఐపీఎల్‌ ఆటగాడు రిక్కీ భుయ్‌పై అందరి దృష్టి ఉంది. వైజాగ్‌ స్టేడియంలో మొదలయ్యే ఈ లీగ్‌కు టాలీవుడ్‌ నటి శ్రీలీల గౌరవ అతిథిగా హాజరుకానుంది. రాయలసీమ కింగ్స్‌కు విహారి, ఉత్తరాంధ్ర లయన్స్‌కు భరత్‌, కోస్టల్‌ జట్టుకు రషీద్‌ ఆడుతున్నారు.