Home   »  ఆంధ్రప్రదేశ్   »   గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ ..

గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ ..

schedule mounika

AP: గుడ్‌ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. గతేడాది డిసెంబర్ నుంచి 2023 జులై వరకు సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్ ఉన్నవారికి ఇవాళ డబ్బుల్ని జమ చేస్తున్నారు. DEC-2022 నుంచి JUL 2023 మధ్య రాష్ట్రంలో అర్హత కలిగిన 2 లక్షల 312 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

కార్డులు పొందిన వారికి వచ్చే నెల నుంచే బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు. 1,49,895 మందికి కొత్త పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.ప్రభుత్వం పథకాలకు అర్హులై ఉండి కూడా.. కొందరు లబ్ధి పొందలేకపోయారు. అయితే ఆయా పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.