బాపట్ల: రక్షించాల్సిన పోలీసులే.. రాక్షసుల్లా మారుతున్నారు.. అండగా ఉండాల్సిన వాళ్లే.. అదును చూసి కాటు వేసి. ఆపై బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా వెలుగుచూసిన ఘటన కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకలకు పిలిచి SI తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి అద్దంకి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు CI తెలిపారు.
బాపట్ల జిల్లా అద్దంకి ఎస్సైగా పనిచేసిన సమందర్వలీ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిచి, మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడని తెలిపింది. మత్తులోకి వెళ్లాక రేప్ చేసి, ఫోన్లో రికార్డు చేశాడని పేర్కొంది. పెళ్లి చేసుకోమని కోరగా…చంపుతానని బెదిరించాడని చెప్పింది. SI పై కేసు నమోదుచేసినట్లు CI రమేశ్ బాబు తెలిపారు.