Home   »  ఆంధ్రప్రదేశ్   »   ఏపీ హైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి.. రాజకీయాల్లో ఉంటూనే నిత్య విద్యార్థిగా కొనసాగుతున్న ఝాన్సీ..

ఏపీ హైకోర్టు న్యాయవాదిగా బొత్స సతీమణి.. రాజకీయాల్లో ఉంటూనే నిత్య విద్యార్థిగా కొనసాగుతున్న ఝాన్సీ..

schedule raju

ఆంధ్రప్రదేశ్, ఏపీ హైకోర్టు: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బోత్స ఝాన్సీ లక్ష్మీ ఏపీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. బొత్స రాజకీయ రంగ ప్రవేశం చేసిననాటి నుండి ఆయన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన ఆమె రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించారు. బొత్స ఝాన్సీ ఇప్పటివరకు 2 సార్లు విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా, 2 సార్లు ఎంపిగా కూడా పని చేశారు. ఆమె పొలిటికల్ కెరీర్ గురించి ఓ సారి చూస్తే.. 2006 బొబ్బిలి ఎంపి ఉప ఎన్నికల్లో ఘాన్సీ తొలిసారి ఎంపిగా ఎన్నికయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో కూడా విజయనగరం ఎంపిగా పోటీచేసి భారీ మెజారిటీతో రెండో సారి కూడా ఎంపిగా ఎన్నికయ్యారు. ఢిల్లీ రాజకీయాల్లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కూడా గుర్తింపు పొందారు. ఇప్పటికీ యాక్టీవ్ పాలిటిక్స్‌లో బిజీగానే ఉన్నా, ఎప్పుడూతన చదువుకు బ్రేక్ ఇవ్వలేదు. చదువుకు వయస్సు అడ్డు కాదు, కాకూడదని గట్టిగా నమ్మి ఆచరించారు.