అమరావతిః టీడీపీ అధినేత చంద్రబాబు కనిగిరిలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ను చంద్రబాబు(Chandrababu) సందర్శించారు. అనంతరం క్యాంటీన్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా చంద్రబాబు స్వయంగా వచ్చిన వారికి భోజనాలు వడ్డించారు.
అన్న క్యాంటీన్ను నిర్వాహకులను అభినందించిన Chandrababu..
పేదలకు భోజనం అందించే అన్న క్యాంటీన్ ను కొనసాగిస్తుండడంపై చంద్రబాబు నిర్వాహకులను అభినందించారు. అంతేకాదు, స్వయంగా పలువురికి భోజనం వడ్డించారు.
అన్న క్యాంటీన్ సందర్శన సందర్భంగా అక్కడి వంటవాళ్లతోనూ చంద్రబాబు మాట్లాడారు. అన్న క్యాంటీన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ వంటి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు కూడా ఉన్నారు.
ALSO READ: పవన్ కళ్యాణ్ ని డాక్టరేట్ కి ఎంపిక చేసిన వేల్స్ యూనివర్సిటీ