Home   »  ఆంధ్రప్రదేశ్   »    మెగా DSC కోసం APలో కొనసాగుతున్న ఆందోళనలు..

 మెగా DSC కోసం APలో కొనసాగుతున్న ఆందోళనలు..

schedule mahesh

Mega DSC | ఆంధ్రప్రదేశ్ లో మెగా DSC వేయాలంటూ నిరుద్యోగుల ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా నేడు NSUI నేతలు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని ముట్టడికి ప్రయత్నించారు.

concerns-continue-in-ap-for-mega-dsc

Mega DSC | APలో మెగా DSC వేయాలంటూ ఆందోళనలు కొనసాగుతోన్నాయి. తాజాగా నేడు నంద్యాల జిల్లా డోన్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిని NSUI నేతలు ముట్టడికి ప్రయత్నించారు. 25 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి బుగ్గనకు వినతిపత్రం అందజేసేందుకు NSUI నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు.

ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు

దింతో పోలీసులు, NSUI నేతల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో నంద్యాల టౌన్ CI ప్రవీణ్ కుమార్ కిందపడిపోయారు. అనంతరం నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. నిన్న కూడా ఇదే డిమాండ్ తో మంత్రి అంబటి రాంబాబు ఇంటిని యూత్ కాంగ్రెస్ నేతలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. సత్తెనపల్లిలోని అంబటి ఇంటికి చేరుకున్న నేతలు ప్లకార్డులతో నిరసన తెలియజేసారు. వారిని అడ్డుకునేందుకు YCP కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Also Read | APలో “రాజధాని ఫైల్స్‌” సినిమా విడుదలకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్‌