Home   »  ఆంధ్రప్రదేశ్   »   మైలవరంలో రూ.20 లక్షలతో సిమెంట్ రహదారుల నిర్మాణం..

మైలవరంలో రూ.20 లక్షలతో సిమెంట్ రహదారుల నిర్మాణం..

schedule mounika

మైలవరంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు. మైలవరం పట్టణంలో రెండవ సచివాలయం పరిధిలో రూ.20 లక్షల నిధులతో తలపెట్టిన సిమెంట్ రహదారుల నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం పట్టణంలో ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.