ఆంధ్రప్రదేశ్: విజయవాడలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం. విజయవాడలోని ఓ బైక్ షోరూమ్లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని బైక్ షోరూమ్ యజమాని తెలిపారు. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పై కెపి నగర్ ప్రాంతంలో వున్నటీవీఎస్ షోరూమ్, గోడౌన్లో మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదంలో 300 ద్విచక్ర వాహనాలు దగ్ధం
Related News
Also Read