Home   »  ఆంధ్రప్రదేశ్   »   మద్యం మత్తులో మానవ తప్పిదం…!

మద్యం మత్తులో మానవ తప్పిదం…!

schedule sirisha

శ్రీకాకుళం: మద్యం మత్తులో మానవతా విలువలు మరిచి విచక్షణారహితంగా ఓ వ్యక్తి ప్రవర్తించిన ఘటన శ్రీకాకుళంలో జరిగింది. పొందూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ యువకుడు అధికంగా మద్యం సేవించి స్వామి వివేకానంద విగ్రహాన్ని కర్రతో కొట్టి ధ్వంసం చేసి ఉమ్మేస్తూ బూతులు తిడుతుండగా సీసీటీవీలో రికార్డయింది.

ప్రిన్సిపాల్ ఉదయం పాఠశాలకు వచ్చేసరికి విగ్రహం ధ్వంసమై ఉండటం చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.