ఆంధ్రప్రదేశ్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 నుంచి 2025-26 సంవత్సరం వరకు పెంచిన ఫీజులు అమల్లో ఉంటాయని పేర్కొంది.
MBBS ప్రస్తుత కన్వీనర్ కోటా ఫీజు రూ. 15,000 ఉండగా రూ.16,500కు పెంచింది, B కేటగిరీ ఫీజు రూ. 12,00,000 ఉండగా రూ.13,20,000కు పెంచింది.
BDS కన్వీనర్ కోటా రూ.13,000 ఉండగా రూ. 14,300కు పెంచింది, B కేటగిరీ ఫీజు రూ.4,00,000 ఉండగా రూ.4,40,000కు పెంచింది.