రాష్ట్రంలో సంచలనం రేపిన TSPSC పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ప్రవీణ్కు సహకరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాజా మూడు అరెస్ట్లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది. ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్, నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్లు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్టులు త్వరలోనే 100 దాటనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాజశేఖర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది……..
రాష్ట్రంలో సంచలనం రేపిన TSPSC పేపర్ల లీకేజీ..
Related News
Also Read