తిరుపతి | తిరుపతి జంతు ప్రదర్శనశాలలో ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి దూకిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సింహం అతడిపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సింహం ఉన్న ఎన్క్లోజర్లోకి ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా దూకిన ఓ వ్యక్తి తిరుపతి జూ(zoo)లో దుర్మరణం చెందాడు. సింహం దాడిలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శన శాలలో గురువారం ఈ దారుణం వెలుగుచూసింది.
పోలీసులు, జూ(zoo) క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గురువారం మధ్యాహ్నం జూకు వచ్చాడు. ఆ తరువాత తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ మీదుగా ఎన్క్లోజర్లోకి దూకాడు. ఈ క్రమంలో అక్కడున్న సింహం అతనిపై దాడిచేసి మెడపట్టి కొరికి చంపేసింది. జంతు సంరక్షకుడు ఇది గమనించి జూ(zoo) క్యూరేటర్ కు , పోలీసులకు తెలిపాడు. పోలీస్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read | తిరుమలలో నేడు ప్రారంభమైన రథ సప్తమి మహోత్సవం..!