Home   »  ఆంధ్రప్రదేశ్   »   మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేశ్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు..

మంగ‌ళ‌గిరి ఆల‌యాల్లో నారా లోకేశ్ కుటుంబం ప్ర‌త్యేక పూజ‌లు..

schedule mounika

మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ ఆల‌యాల‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించారు. ఈ రోజు ఉదయం త‌ల్లి భువ‌నేశ్వ‌రి, భార్య బ్రాహ్మిణి, త‌న‌యుడు దేవాన్ష్‌తో క‌లిసి నారా లోకేశ్ మంగ‌ళ‌గిరిలోని ప్ర‌ముఖ దేవాల‌యాల్లో పూజ‌లు నిర్వ‌హించారు. 

చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు సమర్పించిన Nara Lokesh కుటుంబం..

ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి 20 లక్షల విలువ చేసే బంగారు కిరీటాన్ని బహూకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. 

పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ చేసిన నారా లోకేశ్ కుటుంబం

అనంత‌రం పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నారు.శివాలయంలో భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజ‌లుచేశారు.

కొండ‌పైన ఉన్న‌ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి స‌న్నిధిలో పూజ‌లు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. 

ALSO READ: కనిగిరిలో అన్న క్యాంటీన్ ను సందర్శించిన చంద్రబాబు.