ఆంధ్రప్రదేశ్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఆంధ్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరికలు జారీ చేసింది.