ఆంధ్రప్రదేశ్: ఆంధ్ర లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కొరకు తొలి విడత కౌన్సెలింగ్లో 31,122 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. అయితే 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 10,458 సీట్లు, 181 ప్రైవేట్ కాలేజీల్లో 23,686 సీట్లను కేటాయించారు. తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులంతా ఆగస్టు 23లోపు కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని, ఆ రోజు నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు వివరించారు. ఇంకా 82వేల సీట్లు ఉన్నాయని, మిగిలిన వాటికి మరో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
పాలిటెక్నిక్ తొలి విడత ప్రవేశాలు
Related News
Also Read