Home   »  ఆంధ్రప్రదేశ్జాతీయంరాజకీయంవార్తలు   »   రేణిగుంట టు తిరుపతి..భారీ ర్యాలీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్..

రేణిగుంట టు తిరుపతి..భారీ ర్యాలీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్..

schedule yuvaraju

కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేణిగుంట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ర్యాలీలో భాగంగా ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లారు. 15 కిలోమీటర్ల మేర పవన్‌ను అభిమానులు స్వాగతం పలికారు. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి జనసేన నేతపై దాడి చేసిన సీఐ అంజు యాదవ్‌పై ఫిర్యాదు చేయనున్నారు. గాయపడిన సాయితో పాటు మరో ఏడుగురితో ఎస్పీ వద్దకు పవన్‌ వెళ్లనున్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట పవన్ కల్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.