Home   »  ఆంధ్రప్రదేశ్   »   శ్రీకాకుళం లో రోడ్డు ప్రమాదం….

శ్రీకాకుళం లో రోడ్డు ప్రమాదం….

schedule sirisha

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని సారిపల్లి పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్న యువతి మరణించింది.

పోలీసుల వివరాల ప్రకారం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 20వ వార్డులో నివాసం ఉండే కళ్యాణి కాశీబుగ్గ గాంధీ నగర్‌లోని శ్రీకృష్ణ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్న ఆమెకు ఓ పేషెంట్ దగ్గర నుండి ఫోన్ రావడంతో శిగంపల్లి గ్రామానికి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరింది.

దురదృష్టవశాత్తు, ఆమె సారిపల్లి పెట్రోల్ బంకు వద్దకు రాగానే ఎక్స్‌ప్రెస్ బస్సు ఆమె స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.