Sharmila | APCC అధినేత్రి YS షర్మిల రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికే పరిమితమవుతారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు షర్మిల సుముఖంగా ఉండగా, కేవలం ప్రచారానికే పరిమితం కావాలని, ఎన్నికలు ముగిసిన తర్వాత అవసరమైతే ఆమెను రాజ్యసభకు పంపవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు చెప్పినట్లు సమాచారం. APCC అధ్యక్షురాలిగా, కడప అభ్యర్థిగా ఆమె ద్విపాత్రాభినయం చేయవలసి వస్తే, రాష్ట్రానికి ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఉన్నందున దూకుడుగా ప్రచారం చేయడం సాధ్యం కాదని హైకమాండ్ అభిప్రాయపడింది.
ప్రస్తుతం APCC అధ్యక్షురాలిగా షర్మిల (Sharmila) చురుగ్గా పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో ఎన్నికల సన్నాహాలు, వ్యూహాలపై ఆమె చర్చించారు. ఈ నేపథ్యంలో గురువారం YSR జిల్లా కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశమై పార్టీ కార్యకలాపాలు, కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చర్చించనున్నారు.
Also Read: రాజకీయ హింసను అరికట్టేందుకు ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు నాయుడు