Pension payment | పింఛన్ల చెల్లింపులో ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, తెలుగుదేశం నాయకులపై ఆరోపణలు చేస్తున్న ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, సెర్ప్ (SERP) సీఈవో మురళీధర్రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
పింఛన్ చెల్లింపులో (Pension payment) ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్న ముఖ్యమంత్రి YS జగన్మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ TDP అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
YSRCP చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని, వాలంటీర్ల సమస్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని సాంబశివరావు అన్నారు. ఎన్నికల కోడ్ను విస్మరించి YSRCP ప్రభుత్వం తన ఫ్రెండ్లీ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు చెల్లించిందన్నారు. నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు. కానీ YSRCP మాత్రం తన వైఫల్యాన్ని TDPపై వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్లు వెంటనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ECని కోరారు.
Also Read: కడప నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల..!