TDP workers protested | త్వరలో జరగబోయే AP అసెంబ్లీ ఎన్నికల కోసం TDP విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాపై TDP కి చెందిన పలువురు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానాంశాలు
TDP workers protested | త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాపై TDP కి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలిజాబితాలో టిక్కెట్టు దక్కని నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు, ఏళ్ల తరబడి పార్టీకి విధేయులుగా ఉన్న వారికంటే కొత్తగా వచ్చిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తారని ప్రశ్నించారు.
తంబళ్లపల్లి టికెట్ కేటాయింపుపై విమర్శలు
తాజాగా, తంబళ్లపల్లె నియోజకవర్గం టికెట్ ఆశించిన గొల్ల శంకర్ యాదవ్ మద్దతుదారులు సోమవారం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద నిరసనకు దిగారు. తంబళ్లపల్లె టికెట్ తమ నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ క్యాన్లతో నిరసనకు దిగారు. చంద్రబాబు నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పెట్రోల్ క్యాన్లను సీజ్ చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు.
శంకర్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని డిమాండ్
దీనికి ప్రతిగా శంకర్ యాదవ్ మద్దతుదారులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం TDP అభ్యర్థిగా దాసరి పల్లె జయచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడంతో శంకర్ యాదవ్ అనుచరుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయచంద్రారెడ్డి, పెద్దారెడ్డి అనుచరుడని ఆరోపిస్తూ పార్టీలోని కోవర్టులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ ఆశయ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి అన్యాయం జరగకూడదని వారు వాదిస్తున్నారు.
Also Read | TDP-JSP ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!