శ్రీకాకుళం | కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో చిన్నారి మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది.
కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఓ చిన్నారి మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని రణస్థలం మండలం బీర్పల్లి గ్రామంలో తల్లి లక్ష్మీ, కుమార్తె సంధ్య, మనుమడు రాజు, మనువరాలు భవ్యశ్రీ నివసిస్తున్నారు. వీరిమధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో భరించలేక నలుగురు పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు నలుగురిని హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించగా 10 ఏండ్ల భవ్యశ్రీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మిగతా నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
Also Read: Godavarikhani | నాలుగేళ్లలో 37 మంది మృతి..