ఆంధ్రప్రదేశ్: AP రాష్ట్రంలో పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. IAS అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్లు, ఇతర కీలక శాఖల్లోని అధికారులు కూడా బదిలీ అయ్యారు. వివిధ శాఖల్లో మొత్తం ఎనిమిది IAS బదిలీ అయ్యారు.
కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్గా శ్రీనివాస్, నూపూర్ అజయ్కుమార్, హార్టికల్చర్ అండ్ సెరీకల్చర్ డైరెక్టర్గా గంధం చంద్రుడు, గ్రామ వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్గా ధ్యాన్ చంద్ర నియమితులయ్యారు.
IAS సౌరభ్ గౌర్ ప్రభుత్వ కార్యదర్శిగా, రెసిడెంట్ కమీషనర్, A.P. భవన్ కు బదిలీ చేయబడ్డారు. ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ సలహాదారుగా, కోన శశిధర్ కమిషనర్, పంచాయత్ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ కు, బి. శ్రీధర్ ప్రభుత్వ, I.T.E & C విభాగానికి కార్యదర్శిగా బదిలీ అయ్యారు.